రెండుమూలికలు రేయిబగలు నున్నవి అండదేహమం దొకటి ఆతుమలో నొకటి
యిదివో రసబద్ధము యింద్రియములు మేనిలో పదిలముగా నిలిపి బంధించుట
అదివో వేధాముఖ మంతరంగపుమనసు చెదరకుండా జొనిపి శ్రీహరిదలచుట
తారవిద్య గంటిమి తగిలి నాసాగ్రమందు మేరతో ద్రిష్టినిలిపి మేలుబొందుట
చేరువ సువర్ణవిద్య చిత్తములో బ్రణవము ధీరత నాదముసేసి దేవుని బొగడుట
పుటజయమాయ నిట్టె పుణ్యపాపము లందులో కుటిలపుగోరికల కొన దుంచుట
యిటులనే శ్రీవేంకటేశు డిందిరయును అటు ప్రకృతిపురుషునుటొరవచ్చుట
No comments:
Post a Comment