చేకొనువారికి చేరువిదే పైకొనిజీవులభాగ్యమిదే యేకడ జూచిన యితరము లేదు
తలపులోన నంతర్యామిదివో తెలిసిచూచితే ద్రిష్టంబు
చలమున దనమతి సందేహించిన కలగి మూడులోకంబుల లేడు
వెస గనుదెఱచిన విశ్వాత్మకు డిదె దెపల నింతటా ద్రిష్టంబు
పసిగొని తను బాపములు భ్రమించిన కసరి సృష్టి చీకటివడు నపుడే
చేరి కొలిచితే శ్రీవేంకటపతి సారె బ్రతుకునకు శాసనము
పైరగుతనలో భక్తి వదలితే కూరిమి తెరమఱగునకును మఱగు
No comments:
Post a Comment